కేరళ బామ్మ భగీరథికి ఆధార్ కార్డు
Posted On March 03, 2020
*కేరళ బామ్మ భగీరథి 105 ఏండ్ల వయసులో నాలుగో తరగతి పాసై ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నది.
*నాలుగో తరగతిలో పాసైన సంతోషం ఉన్నా,ఆధార్కార్డు లేకపోవడంతో పింఛన్ పొందలేకపోతున్నానని ఇటీవల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
* ఈ విషయం మీడియాలో రావడంతో స్పందించిన ఓ జాతీయ బ్యాంకు అధికారులు కొల్లాం జిల్లాలోని ఆమె ఇంటిని ఇటీవల సందర్శించారు.
* ఆధార్ నమోదుకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేశారు.
* ‘వృద్ధాప్యం వల్ల భగీరథి అమ్మ వేలి ముద్రలు చెరిగిపోవటంతో ఆధార్ నమోదు యంత్రం స్వీకరించలేకపోయింది.
*ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రక్రియ పూర్తి చేశాం’ అని ఓ అధికారి పేర్కొన్నారు.