యాంటీబాడీల తయారీకి భారత్ బయోటెక్ సిద్ధం
Posted On May 11, 2020
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణక మెడిసిన్కి సంబంధించి విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ బాడీల తయారీకి భారత్ బయోటెక్కు సీఎస్ఐఆర్ అనుమతినిచ్చింది. పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, ఇండోర్లోని ఐఐటీతోపాటు గురుగావ్లోని ప్రెడోమిక్స్ టెక్నాలజీస్లు కూడా ఈ ప్రాజెక్టుకు తమవంతు సాయం అందిస్తాయి. ఎన్ఎంఐటిఎల్ఐ ప్రోగ్రాంలో భాగంగా కొవిడ్ నియంత్రణకు ఉపయోగపడే.. మానవ మోనోక్లోనల్ యాంటీ బాడీస్ తయారీ ప్రాజెక్టును సీఎస్ఆర్ఐ భారత్ బయోటెక్కి అప్పగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ ప్రిడామిక్స్ టెక్నాలజీతో కలసి భారత్ బయో టెక్ పని చేయనుంది.
ఈ మోనోక్లోనల్ యాంటీ బాడీస్ మానవ శరీరంలోని కరోనా వైరస్ను అత్యంత వేగంగా నియంత్రించగలవు.. ఫలితంగా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం సులభతరం కానుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ కన్నా వేగంగా మోనోక్లోనల్ యాంటీ బాడీస్ ప్రభావవంతంగా పనిచేయగలవని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా అభిప్రాయపడ్డారు.