లేబర్ పార్టీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ
Posted On January 07, 2020
*లేబర్ పార్టీ నాయకత్వ రేసులో తాను దిగుతున్నట్లు భారత సంతతికి చెందిన బ్రిటన్ మహిళా ఎంపి ప్రకటించారు.
*ఇంగ్లండ్లోని విఆన్ స్థానం నుండి గెలుపొందిన 40 ఏళ్ల లీసా నంది అక్కడ లేబర్ పార్టీకున్న పట్టును మరోసారి రుజువు చేశారు.
*ప్రస్తుత పార్టీ నేత జెరిమీ కార్బిన్ త్వరలో పదవి నుండి వైదొలగనున్నట్లు ప్రకటించటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈమె ప్రయత్నిస్తుంది.
* గత నెల ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో కార్బిన్ లేబర్పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకుంటానని ప్రకటించారు.దీంతో ఈమె లేబర్ పార్టీ నాయకత్వానికి పోటీపడుతున్నారు.
*లేబర్ పార్టీ నాయకత్వ రేసులోకి దిగుతున్న ఎంపిలలో లీసా నంది నాల్గవ వారు.
*ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీని దీటుగా ఎదుర్కోవడంతో పాటు చేజారిన స్థానాలను దక్కించుకోవటానికి దీర్ఘకాలిక కసరత్తు అవసరం అని లీసా నంది పేర్కొన్నారు.