చక్కెర దిగుమతికి ముందుకు వస్తున్న మలేషియా
Posted On January 23, 2020
*మలేషియా నిర్ణయం -- భారత్ నుంచి చక్కెర కొనుగోళ్లను పెంచాలని నిర్ణయించుకుంది.
*ఎంఎస్ఎం మలేషియా హోల్డింగ్స్ బెర్హాడ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో(జనవరి-మార్చి) భారత్ నుంచి 49.20 మిలియన్ డాలర్ల విలువైన 1,30,000 టన్నుల ముడి చక్కెర కొనుగోలు చేయనుంది.
*2019లో ఈ కంపెనీ భారత్ నుంచి 88,000 టన్నుల ముడి చక్కెరను కొనుగోలు చేసింది.
*ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తి సంస్థ అయిన ఎఫ్జీవీ హోల్డింగ్స్కు చెందినదే ఎంఎస్ఎం చక్కెర శుద్ధి కర్మాగారం.
*ఇటీవల ఇండియా నుంచి 49.40 మిలియన్ డాలర్ల విలువైన 1,30,000టన్నుల ముడి చెక్కెరను దిగుమతి చేసుకుంది మలేషియా.
నేపథ్యం--
*కొన్నాళ్ల కిందట ఐరాస సర్వసభ్య సమావేశంలో మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు.ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టంపై కూడా భారత్కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
*పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్ అంశంలో మలేషియా చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే పామాయిల్ దిగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
*మలేషియా నుంచి పామాయిల్ కొనుగోలు చేయరాదని దేశీయ వ్యాపారులను ఆదేశించింది.
* భారత్కు అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉన్న ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది.
*పామాయిల్కు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలు మలేషియా, ఇండోనేషియా. ఇక మలేషియాకు అతిపెద్ద దిగుమతిదారు భారత్.
*గతేడాది ఈ దేశం నుంచి 4.4 మిలియన్ టన్నుల పామాయిల్ను భారత్ దిగుమతి చేసుకుంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్కు మలేషియా ఎగుమతుల విలువ 10.8 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చు.
*దిగుమతుల విలువ 6.4బిలియన్ డాలర్లుగా ఉండనుంది.
*ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు అయిన భారత్ చక్కెర మిగులు విలువలను కలిగి ఉంది.
*చక్కెర ఎగుమతులకు ఈ సబ్సిడీ ప్రకటించింది.