100 దేశాలతో అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు
Posted On January 17, 2020
*రైజినా డైలాగ్-2020 సమావేశం, వివరాలు---భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజినా డైలాగ్-2020 ఐదో అంతర్జాతీయ సదస్సు జనవరి 14 వ తేదీన ప్రారంభమై మూడు రోజులపాటు జరిగింది.
*ఈ సదస్సులో భారత్ తోపాటు మరో 100 దేశాలకు చెందిన ప్రత్యేక సభ్యులు పాల్గొన్నారు.
*'నావిగేటింగ్ ద ఆల్ఫా సెంచురీ'గా పిలుస్తున్న ఈ సదస్సుకు వివిధ దేశాల మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రధాన ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు తదితరులతో కలిపి దాదాపు 700 మంది హాజరయ్యారు.
* అందులో ముఖ్యంగా 40 శాతం మంది మహిళలే ఉన్నారు.
* స్త్రీ, పురుష సమానత్వ అమలుకు సంబంధించి భారత్ అవలంబిస్తున్న విధానాలపై ప్రసంగించారు.
* భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అబ్జర్వర్ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది.
* సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
సమావేశంలో ముఖ్యమైన భాగం --ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, మారుతున్న వాతావారణం, నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిర్మూలనకు కలిసికట్టుగా తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై తమ ఆలోచనలను వీరంతా భారత్తో పంచుకున్నారు.
*అంతర్జాతీయంగా ఉన్న పలు సమస్యల పరిష్కారం కోసం 2030 వరకు అనుసరించాల్సిన విధానాలపై కూడా చర్చించారు.