10లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటిన తొలి భారతీయ కంపెనీ
Posted On November 28, 2019
*రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత వ్యాపార చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. 10లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువను దాటిన తొలి భారతీయ కంపెనీగా చరిత్రకెక్కింది.
*ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ షేరు ట్రేడింగ్లో 1శాతం పెరిగి 15 వందల 81 రూపాయల 60 పైసలకు చేరింది.
* ఈ ఒక్క ఏడాదే షేరు ధర 40 శాతం పెరగడం విశేషం. అత్యధిక లాభాలు, టెలికాం టారీఫ్ల పెంపు, గ్యాస్ ఉత్పత్తి మొదలవ్వడం కంపెనీ షేర్ను లాభదాయకంగా మార్చింది.
*రిలయన్స్.. అక్టోబర్ 18న 9 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువకు చేరుకుంది.
*నవంబర్ చివరికి వచ్చేసరికి 10 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటింది.
*రిలయన్స్ తర్వాతి స్థానంలో ఉన్న టీసీఎస్కు మార్కెట్ విలువలో దాదాపు 2లక్షల కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది. దీంతో రియలన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేశ్ అంబానీ ప్రపంచంలో 12వ ధనవంతుడిగా మారారు.
*. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఆయన సంపద 60.7 బిలియన్ల డాలర్లుగా ఉంది.