కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్ను వీడిన సందేశ్
Posted On May 21, 2020
ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్తో ఆరేళ్లు గడిపిన తర్వాత జాతీయ ఫుట్బాల్ జట్టు డిఫెన్సివ్ లించ్పిన్ సందేష్ జింగాన్ బుధవారం కేరళ బ్లాస్టర్స్ నుంచి నిష్క్రమించారు. చండీగఢ్కు చెందిన 26 ఏళ్ల సందేశ్ డిఫెన్స్లో దిట్ట. 2015 లో అరంగేట్రం చేసినప్పటి నుండి భారతదేశం కోసం 36 క్యాప్స్ సంపాదించిన జింగాన్, మరియు రాబోయే ఐఎస్ఎల్ సీజన్ కంటే ముందే విడిపోవడానికి బ్లాస్టర్స్ పరస్పరం అంగీకరించారని క్లబ్ వర్గాలు తెలిపాయి. ఐఎస్ఎల్లో రెండుసార్లు (2014, 2016) కేరళను ఫైనల్కు చేర్చడంతో కీలకపాత్ర పోషించాడు.
గాయంతో గత 2019–20 సీజన్కు పూర్తిగా దూరం కావడంతో కేరళ బ్లాస్టర్స్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైంది. 10 జట్లు తలపడిన ఐఎస్ఎల్లో కేరళ పేలవమైన ఆటతీరుతో ఏడో స్థానంలో నిలిచింది.