భారత్ కు ఆఫ్రికా చిరుతలు
Posted On January 30, 2020
*ఆఫ్రికాకు చెందిన చిరుతలను భారత దేశంలోని అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది.
*మధ్యప్రదేశ్ లోని నౌరదేహీ అభయారణ్యంలోకి చిరుతలను ప్రవేశపెట్టబోతున్నారు.
*విదేశీ జంతువును మన అడవుల్లో ప్రవేశపెడితే ఎలాంటి పరిణామాలుంటాయో అన్న సందేహంలో 2013 లో సుప్రీం కోర్టు అనుమతిని నిరాకరించింది.
* దాదాపు ఏడేళ్ల వేడుకోళ్ల తరువాత సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ప్రయోగాత్మకంగా కునో పాల్పుర్ అభయారణ్యంలోకి ప్రవేశపెట్టాల్సింది గా సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.
*అధికారిక లెక్కల ప్రకారం,చివరిసారిగా భారత జాతి చిరుతపులి చివరిసారిగా 1947లో కనిపించింది.
* చిట్ట చివరి చిరుతను 1947 లో వేటగాళ్లు హతమార్చారు.1952 నుంచి ఈ జాతి చిరుత పులులను అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చడం జరిగింది.
*కేసు నేపథ్యం--భారతదేశంలో చిరుత పులులు అంతరించిపోతున్న నేపథ్యంలో జాతీయ పులుల సంరక్షణా సంస్థ (NTCA) ఆందోళన వ్యక్తం చేసింది.
* నమీబియా నుంచి ఆఫ్రికన్ చిరుత పులులను భారత్కు తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించింది. NTCA పిటిషన్ మేరకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది.
*ఇందులో వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ రంజిత్ సింగ్, వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా డీజీ ధనంజయ్ మోహన్, కేంద్రపర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖలో డీఐజీని సభ్యులుగా నియమించింది. NTCAకు సూచనలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
*కేసును విచారణ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లు ఈ ప్రాజెక్టును స్వయంగా పర్యవేక్షించారు.
*ఆఫ్రికన్ జాతి చిరుతపులులు ఉండేందుకు ఏ అటవీ ప్రాంతం అయితే అనుకూలిస్తుందో దానిపై పూర్తిగా సర్వే చేయాల్సిన బాధ్యతను త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు అప్పగించింది.
*మధ్యప్రదేశ్లోని నౌరదేహీ వన్యప్రాణుల సంరక్షణా కేంద్రంలో ఆఫ్రికన్ జాతి చిరుత పులులను ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని త్రిసభ్య కమిటీ నివేదికలో పొందుపర్చింది.