తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్ గోయల్
Posted On March 06, 2020
*తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా శశాంక్ గోయల్ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఉత్తర్వులు జారీ చేసింది.
* ఉత్తరప్రదేశ్కు చెందిన ఆయన గతంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా, ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్గా పనిచేశారు.
*విద్యా శాఖ డెరైక్టర్గా, నిజామాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్గా కూడా వ్యవహరించారు.
*1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శశాంక్ ప్రస్తుతం కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.అంతకుముందు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శిగా డిప్యూటేషన్పై పనిచేశారు
*గతంలో రాష్ట్ర సీఈవోగా పనిచేసిన రజత్కుమార్ను ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
* రజత్ కుమార్ స్థానంలో, శశాంక్ నియమితులయ్యారు.