సింధూ నాగరికతకు సంబంధించిన పెద్ద నగరమైన మొహంజదారోకి సంబంధించి సరికాని దానిని గుర్తించుము?
(A)మొహంజోదారో అనగా మృతులదిబ్బ అని అర్థం (B)మొహంజోదారోలో మాపురం ఉన్న ఎద్దు ముద్రిక లభించింది (C)మొహంజోదారోలో పశుపతి మహాదేవుని ముద్రిక లభించింది (D)మొహంజోదారోలో నాట్యకత్తె కాంస్య విగ్రహం లభించింది.
జతపరుచుము:
ప్రదేశం కనుగొన్న వ్యక్తులు
A) చన్హుదారో i) ఎస్.ఆర్. రావు
B) కాళీభంగన్ ii) ఆర్.ఎస్. బిస్త్
C) లోథాల్ iii) ఎన్.జి. మజుందార్
D) బన్వాలి iv) ఎ.ఘోష్
ప్రవచనం (ఎ) :- సింధూ నాగరికతతోపాటు వెలసిల్లిన నాగరికతల ప్రజలకంటే ముందే వీరు వస్త్రాలను ధరించడం ఆరంభించారు.
కారణం (ఆర్) :- సింధూ నాగరికత ప్రజలు ప్రపంచంలో మొదటిసారిగా ప్రత్తిని పండించారు, హరప్ప మొదలైన నగరాల్లో దోవతి ధరించిన వ్యక్తి విగ్రహం లభించింది, సింధు ప్రజలు వారి సమీప నాగరికత ప్రజలకు నూలు వస్త్రాలు ఎగుమతి చేసినట్లు రుజువులు కూడా లభించాయి.
(A)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ (B)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ కాదు (C)'ఎ' సరి అయినది 'ఆర్' సరి అయినది కాదు (D)'ఎ' సరి అయినది కాదు 'ఆర్' సరి అయినది
సింధూ నాగరికత ప్రజల విదేశీ వాణిజ్యం గురించి, సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) మెసపటోమియా నాగరికతకు చెందిన' ఉమ్మా' అనే నగరంలో సింధు ప్రజలకు సంబంధించిన బాలిక వస్త్రం లభించింది.
బి) సింధు నాగరికత ప్రజలు నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, రాగి, ముత్యాలు మరియు దంతాలు మొదలైన వాటిని విదేశాలకు ఎగుమతులు చేశారు.
సి) సింధూ నాగరికత ప్రజలు వర్తకంలో వస్తు మార్పిడి విధానంను పాటించారు.
డి) సింధూ నాగరికత ప్రజలు ఎక్కువగా మెసపటోమియా, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్, పర్షియా మరియు బహ్రెయిన్ దేశాలతో ఎక్కువగా వర్తకం చేశారు.
(A)ఎ,బి సరి అయినవి (B)బి,సి,డి సరి అయినవి (C)ఎ,బి,సి,డి సరి అయినవి (D)ఎ,బి,సి సరి అయినవి
క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించుము?
ఎ) సింధూ నాగరికత ప్రజలు, తూనికలు కొలతలలో 22 సంఖ్యను ప్రామాణిక యూనిట్గా తీసుకున్నారు.
బి) సింధూ నాగరికత ప్రాంతంలో దొరికిన పశుపతి మహాదేవుని ముద్రికలో పశుపతి మహాదేవుని చుట్టూ గల 4 జంతువులు 4 దిక్కులను సూచిస్తుంటాయి.
(A)ఎ సరి అయినది (B)బి సరి అయినది (C)ఎ,బి సరి అయినది (D)ఎ,బి సరి అయినది
క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) భారతదేశ చరిత్రలో లింగపూజకు, అగ్నిపూజకు ఆద్యులు సింధూ నాగరికత ప్రజలు
బి) సింధూ నాగరికతకు చెందిన ప్రజలు జంతు బలులు ఇచ్చేవారు కారు
సి) సింధు ప్రజలు బహుదేవతారాధకులు
డి) శివుడిని లింగరూపంలో మొదటిసారిగా కొలిచినది సింధూ నాగరికతకు చెందిన ప్రజలు
(A)ఎ,బి సరి అయినవి (B)బి,సి,డి సరి అయినవి (C)ఎ,బి,సి,డి సరి అయినవి (D)ఎ,సి,డి సరి అయినవి
హరప్ప నగరంలో బయల్పడిన వాటికి సంబంధించి సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) హరప్ప లో అమ్మ తల్లికి బలిస్తున్న మేక ముద్రిక లభించింది.
బి) హరప్ప లో ధోవతి ధరించిన వ్యక్తి విగ్రహం లభించింది.
సి) హరప్పలో మానవుని మృతదేహం వున్న శవపేటిక లభించింది.
డి) హరప్పలో 12 ధాన్యాగారాలు లభించినవి
(A)ఎ,బి సరి అయినవి (B)బి,సి,డి సరి అయినవి (C)ఎ,బి,సి,డి సరి అయినవి (D)ఎ,బి,సి సరి అయినవి
లోథాల్ పట్టణం గురించి సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) ప్రపంచంలోనే తొలి పోటు రేవు పట్టణం
బి) విదేశీ వ్యాపారానికి ముఖ్య కేంద్రం
సి) లోథాల్ భోగవా-సబర్మతి నదుల మధ్య వున్నది
(A)ఎ,బి సరి అయినవి (B)బి,సి సరి అయినవి (C)ఎ,బి,సి సరి అయినవి (D)ఎ,సి సరి అయినవి
(A)భారతదేశంలో సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువగా వున్న రాష్ట్రం హర్యానా (B)సింధు నాగరికత ప్రజలు రాజస్థాన్ లోని ఖేత్రీ గనుల నుండి రాగిని దిగుమతి చేసుకునేవారు. (C)సింధు నాగరికత సంస్కృతిలో ముఖ్యమైన అంశం నగరీకరణ (D)సింధు నాగరికత సుమారు 5 వేల సంవత్సరాల పురాతనమైనది
ప్రవచనం (ఎ) :- ప్రపంచం మొత్తం మీద వెండి లోహాన్ని ఉపయోగించినది సింధు ప్రజలు?
కారణం (ఆర్) :- సింధు ప్రజలు వెండి, బంగారు, వజ్రాలను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు.
(A)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ (B)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ కాదు (C)'ఎ' సరి అయినది 'ఆర్' సరి అయినది కాదు (D)'ఎ' సరి అయినది కాదు 'ఆర్' సరి అయినది
ప్రతిపాదన (ఎ) :- సింధూ నాగరికత నాటి మత విశ్వాసములను ప్రతిబింబించే దేవాలయములు గాని ప్రజలంతా కలిసి ఆరాధన చేసే ప్రాంతములు గాని లభ్యం కాలేదు.
కారణం (ఆర్) :- సింధూ నాగరికత ప్రజలకు మతం వ్యక్తి గతం కాని సామూహిక విశ్వాసం కాదు.
(A)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ (B)'ఎ', 'ఆర్'లు సరి అయినవి 'ఎ'కు 'ఆర్' సరి అయిన వివరణ కాదు (C)'ఎ' సరి అయినది 'ఆర్' సరి అయినది కాదు (D)'ఎ' సరి అయినది కాదు 'ఆర్' సరి అయినది
క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) సింధు ప్రజలు శాంతి ప్రియులు
బి) భారత ఉపఖండంలో మొదట వ్యవసాయం ప్రారంభమైన ప్రాంతం మొహ్రగడ్
సి) సింధు ప్రజలు ఎక్కువగా వినియోగించిన లోహం వెండి
(A)ఎ, బి సరి అయినవి (B)బి, సి సరి అయినవి (C)ఎ,బి,సి సరి అయినవి (D)ఎ,సి సరి అయినవి
ఇటీవల ఖరగ్పూర్ ఐ.ఐ.టి పరిశోధకులు సింధూ నాగరికతకు సంబంధించి చెప్పిన విషయాలను గుర్తించుము?
ఎ) సింధు లోయలో 900 ఏండ్లపాటు వర్షాభావ పరిస్థితులు ఏర్పాడ్డాయి అని తేల్చారు.
బి) అత్యధిక శాతం మంది పరిశోధకులు 200 ఏండ్లపాటు వరుసగా కరువు పరిస్థితులను నెలకొనడం వల్లే సింధూ
నాగరికత అంతరించిందని పేర్కొన్నారు.
సి) సింధూ నాగరికత అంతం గురించి తెలుసుకోవడానికి ఐ.ఐ.టి ఖరగ్పూర్లోని భూగర్భ, భూ భౌతికశాస్త్ర విభాగాలకు చెందిన పరిశోధకులు హిమాలయ వాయువ్య ప్రాంతంలో గత ఐదువేల ఏండ్లలో రుతుపవనాలు వైవిధ్యం పై పరిశోధన జరిపారు
దానికి గాను జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని లేహ్ మరియు లడఖ్ ప్రాంతాల మధ్యవున్న 'త్సో మొరిరి' సరస్సు ప్రాంతంలో వర్షపాతాన్ని విశ్లేషించారు.
(A)ఎ,బి సరి అయినవి (B)బి,సి సరి అయినవి (C)ఎ,బి,సి సరి అయినవి (D)ఎ,సి సరి అయినవి
ఆర్యులకు సంబంధించి సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) భారతదేశంలో ఇనుమును వాడిన తొలి ప్రజలు ఆర్యులు
బి) ఆర్యులు సంస్కృత భాషను మొట్టమొదట మాట్లాడారు
సి) భారతదేశంలో గుర్రంను ఉపయోగించిన తొలి ప్రజలు ఆర్యులు
డి) ఆర్యులు కంచు యుగపు నాగరికతను నాశనం చేసి ఇనుము యుగానికి నాంది పలికారు
(A)ఎ,బి సరి అయినవి (B)ఎ,సి,డి సరి అయినవి (C)ఎ,బి,సి,డి సరి అయినవి (D)ఎ,బి,సి సరి అయినవి
ఆర్యుల జన్మ స్థానం అభిప్రాయం వ్యక్తం చేసిన వ్యక్తులు
A) టిబెట్ i) బాలగంగాధర్ తిలక్
B) ఆర్కిటిక్ ప్రాంతం ii) రాజ్బాలి పాండే
C) సప్త సింధూ iii) దయానంద సరస్వతి
D) మధ్య భారతదేశం iv) ఎ.సి. దాస్