1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించిన సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి, ఇతనికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్య నిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు.
బి) 1773 రెగ్యులేటింగ్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనికీ 20 సం||ల వ్యాపార అనుమతిని ఇచ్చింది.
సి) బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్కు ఆధీనులుగా చేయడం జరిగింది.
డి) ఈస్ట్ ఇండియా కంపెని అధికారుల వ్యాపార లావాదేవీలను ప్రోత్సహిస్తువారు ప్రజల నుండి బహుమతులు తీసుకోనే అవకాశాన్ని ప్రోత్సహించింది.
(A) ఎ,బి సరి అయినవి (B)బి,సి,డి సరి అయినవి (C)ఎ,బి,సి మరియు డి సరి అయినవి (D)ఎ,బి,సి సరి అయినవి
1833 చార్టర్ చట్టంనకు సంబంధించి సరికాని అంశంను గుర్తించుము?
(A)గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని భారత గవర్నర్ జనరల్గా మార్చారు. (B) భారతీయ శాసనాలను క్రోడికరించడానికి ఒక భారతీయ' లా' కమీషన్ను నియమించారు. (C)1833 చార్టర్ చట్టంను భారతదేశంలో కేంద్రీకృతపాలనకు తుదిమెట్టుగా అభివర్ణిస్తారు. (D)కంపెనీ పాలనను మరొక 20 సం||రాలు పొడిగించలేదు.
సైమన్ కమీషన్ సిఫార్సులకు సంబంధించి సరికాని అంశంను గుర్తించుము?
(A)షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించింది సైమన్ కమీషన్ (B)భారతీయులకు తమ ప్రభుత్వ నిర్వహణలో పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి (C)సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించాలి (D)ఏకకేంద్ర వ్యవస్థ భారతదేశానికి సరిపడదు కనుక సమాఖ్య
వ్యవస్థను అభివృద్ధి చేయాలి.
వివరణ (ఎ) :- భారతీయులకు రాజ్యాంగాన్ని రచించే సామర్థ్యం కలదు అని 1920 దశాబ్దంలోనే రుజువైంది.
కారణం (ఆర్) :- 1928 లో భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన స్వయంగా రచించుకోగలరా అని
సవాలు విసిరిన భారత వ్యవహారాల మంత్రి సవాలును స్వీకరించిన కాంగ్రెస్ మరియు ఇతర రాజకీయ పార్టీలు మొతీలాల్ నెహ్రూ
అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘంను నియమించగా ఉపసంఘం తక్కువ రోజుల్లోనే అద్బుతమైన ప్రాథమిక హక్కులతో
కూడిన నివేదికను తయారు చేసి భారతీయుల రాజ్యాంగ రచనా సామర్థ్యంను నిరూపించింది.
(A) ఎ ,ఆర్, లు సరి అయినవి ఎ,కు ,ఆర్ , సరి అయిన వివరణ (B)ఎ, ఆర్ , లు సరి అయినవి ఎ, , కు , ఆర్ , సరి అయిన వివరణ కాదు (C)ఎ, సరి అయినది , ఆర్, సరి అయినది కాదు (D)ఎ , సరి అయినది కాదు , ఆర్ , సరి అయినది
ఎ) మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో భావి భారత రాజ్యాంగం సమాఖ్యంగా ఉండాలా లేదా ఏకకేంద్రంగా ఉండాలా అనే
అంశం మీద చర్చ జరిగింది.
బి) రెండు కొత్త ముస్లిమ్ మెజార్టీ ప్రావిన్స్లను ఏర్పాటు చేస్తున్నట్లు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటించే సరికి బ్రిటీష్
ప్రభుత్వాన్ని గాంధీజీ నిందించారు.
సి) మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు (సిఫారసులు) ప్రకటించ లేదు.
(A) ఎ,బి సరి అయినవి (B)బి,సి సరి అయినవి (C)ఎ,బి,సి సరి అయినవి (D)సి,ఎ సరి అయినవి
1935 భారత ప్రభుత్వ చట్టంనకు సంబంధించిన కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనకు సంబంధించి సరికానిది?
(A)ఫెడరల్ (కేంద్ర) జాబితా - 59 అంశాలు (B)ప్రోవిన్షియల్ (రాష్ట్ర) జాబితా - 54 అంశాలు (C) ఉమ్మడి జాబితా - 36 అంశాలు (D)అవశిష్ట జాబితా - ప్రొవిన్షియల్లకు ఇచ్చారు
ప్రవచనం (ఎ) :- 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలుగా భావిస్తారు.
కారణం (ఆర్) :- భారత రాజ్యాంగ నిర్మాతలు 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా అంశాలను స్వీకరించారు.
(A)ఎ ,ఆర్, లు సరి అయినవి ఎ,కు ,ఆర్ , సరి అయిన వివరణ (B)ఎ, ఆర్ , లు సరి అయినవి ఎ, , కు , ఆర్ , సరి అయిన వివరణ కాదు (C)ఎ, సరి అయినది , ఆర్, సరి అయినది కాదు (D)ఎ , సరి అయినది కాదు , ఆర్ , సరి అయినది
ప్రవచనం (ఎ) :- రాజ్యాంగ సభ ఏర్పాటు గురించి ప్రతిపాదించిన మొదటి బ్రిటీష్ కమిటి క్రిప్స్ కమిటి
కారణం (ఆర్) :- క్రిప్స్ ప్రతిపాదనలను భారత జాతీయ నాయకులు స్వాగతించారు.
(A)ఎ ,ఆర్, లు సరి అయినవి ఎ,కు ,ఆర్ , సరి అయిన వివరణ (B) ఎ, ఆర్ , లు సరి అయినవి ఎ, , కు , ఆర్ , సరి అయిన వివరణ కాదు (C) ఎ, సరి అయినది , ఆర్, సరి అయినది కాదు (D) ఎ , సరి అయినది కాదు , ఆర్ , సరి అయినది
ప్రవచనం (ఎ) :- 1946 వ సంవత్సరంలో భారతదేశంలో పర్యటించిన బ్రిటన్ కేబినెట్ మంత్రుల రాయబార బృందం
పాకిస్తాన్ అనే మరొక దేశం ఏర్పడే భావన ఆచరణ సాధ్యం కాదు అని ప్రకటించింది.
కారణం (ఆర్) :- మౌంట్ బాటన్ ప్రణాళిక-1947 మాత్రం ఇండియన్ యూనియన్ నుండి భారతదేశం, పాకిస్తాన్ అను రెండు దేశాలు
ఏర్పడతాయి అని ప్రకటించింది.
(A)ఎ ,ఆర్, లు సరి అయినవి ఎ,కు ,ఆర్ , సరి అయిన వివరణ (B) ఎ, ఆర్ , లు సరి అయినవి ఎ, , కు , ఆర్ , సరి అయిన వివరణ కాదు (C) ఎ, సరి అయినది , ఆర్, సరి అయినది కాదు (D) ఎ , సరి అయినది కాదు , ఆర్ , సరి అయినది
క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ. 3వ పంచవర్ష ప్రణాళికలో దీర్ఘదర్శి స్వభావం మనకు కనిపిస్తుంది.
బి. 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే మొదటిసారిగా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో మనకు మిగులు కనపడుతుంది.
సి. భారతదేశంలో నిరంతర ప్రణాళికలను రూపొందించి అమలు చేసింది గున్నార్ మిర్ధాల్
డి. ప్రొ|| రాజ్కృష్ణ పేర్కొన్న"హిందూ వృద్ధిరేటును" అధికమించి వృద్ధిరేటును సాధించిన మొదటి ప్రణాళిక 5వ ప్రణాళిక
(A) ఎ,బి సరి అయినవి (B)ఎ,బి,సి సరి అయినవి (C)బి,సి,డి సరి అయినవి (D)ఎ,బి,సి,డి సరి అయినవి
ప్రవచనం (ఎ) :- వార్షిక ప్రణాళికల కాలంలో దేశంలో హరిత విప్లవం ప్రారంభమైంది?
కారణం (ఆర్) :- పంచవర్ష ప్రణాళికల రూపకర్తలు హరిత విప్లవంనకు సుముఖంగా లేరు?
(A)ఎ ,ఆర్, లు సరి అయినవి ఎ,కు ,ఆర్ , సరి అయిన వివరణ (B)ఎ, ఆర్ , లు సరి అయినవి ఎ, , కు , ఆర్ , సరి అయిన వివరణ కాదు (C)ఎ, సరి అయినది , ఆర్, సరి అయినది కాదు (D) ఎ , సరి అయినది కాదు , ఆర్ , సరి అయినది